హైదరాబాద్
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచనలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా నటీనటులను 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశా. అయినా సీఎం ఆదేశం మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నారు. తన పోస్ట్కు రేవంత్, సీఎంఓ ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు.