YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు
అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి వార్తలతో అంత‌ర్జాతీయ ప‌రిణామాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ డీలాపడ్డాయి. చివ‌ర‌కు ఈ రోజు మార్కెట్లు న‌ష్టాల‌తోనే ముగిశాయి. రిజ‌ర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందున్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో ప్రధానంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు ప్ర‌తికూలంగా సాగాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 109 పాయింట్లు క్షీణించి 34,903 వద్ద నిలవగా.. నిఫ్టీ 35 పాయింట్ల వెనకడుగుతో 10,593 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో కేవ‌లం 10 కంపెనీలు మాత్ర‌మే బీఎస్ఈ30లో లాభ‌ప‌డ్డాయి. రిల‌య‌న్స్(0.90%), టాటా స్టీల్(0.88%), హెచ్‌డీఎఫ్‌సీ(0.78%), మారుతి(0.69%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.68%) కంపెనీలు లాభ‌ప‌డిన వాటిలో ముందుండగా మ‌రో వైపు కోల్ ఇండియా(2.36%), భార‌తీ ఎయిర్టెల్(2.16%), ఎల్ అండ్ టీ(1.93%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.87%), యెస్ బ్యాంక్(1.84%), విప్రో(1.77%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి. 

Related Posts