YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

నీట్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

 నీట్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని అబిడ్స్‌‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మయూరి కాంప్లెక్స్ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి పడి ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మంగళవారం  ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంది. లేదా ఎవరైనా తోసేశారా? ప్రమాదవశాత్తూ పడిపోయిందా అనేది తేలాల్సి ఉంది. నీట్ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కౌర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కౌర్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పదో అంతస్థు నుంచి కిందపడి ఆమె ప్రాణాలు వదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే అంశాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. 

Related Posts