YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తెలుగు డైరక్టర్స్ ఫుల్ ఎంజాయ్

తెలుగు డైరక్టర్స్ ఫుల్ ఎంజాయ్

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన 9 మంది టాప్ డైరెక్టర్లు వంశీ పైడిపల్లి ఇంట్లో కలిసి ఎంజాయ్ చేశారు. డిన్నర్ చేయడంతోపాటు తెల్లవారుజామున 4 గంటల వరకు సరదాగా గడిపారు. వంశీ పైడిపల్లి, సుకుమార్ చొరవ తీసుకోగా.. రాజమౌళి, కొరటాల శివ, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, క్రిష్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఈ విందులో పాల్గొన్నారు. మర్చిపోలేని సాయంత్రం.. అద్భుతమైన వ్యక్తులంతా సాయంత్రం మా ఇంటికొచ్చారు. థాంక్యూ అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. వంశీ ఆతిథ్యం.. రాజమౌళి సహా 9 మంది డైరెక్టర్ల భేటీ అనిల్ రావిపూడి బదులిస్తూ.. ‘ఫన్’టాస్టిక్. అద్భుతంగా గడిపాం. అందరికీ ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్యూ వంశీ అన్నా అని ట్వీట్ చేశాడు. వంశీ, సుకుమార్ చొరవతో మేమంతా కలిసి ఎంజాయ్ చేశాం. శివ, హరీష్ చెప్పిన స్టోరీలను ఎప్పటికీ మర్చిపోలేం. తెల్లవారు జామున 4 గంటల వరకూ నవ్వుతూనే ఉన్నామని రాజమౌళి ట్వీట్ చేశాడు. తెలుగు హీరోలు కలిసి గడిపినట్టుగానే వీరంతా కలిసి గడిపారా? లేదంటే వీరి మధ్య ఏదైనా విషయం చర్చకు వచ్చిందా? అనే ప్రశ్న సినీ అభిమానుల మదిని తొలుస్తోంది. వంశీ పైడిపల్లి త్వరలోనే మహేష్ బాబు సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్‌లు నిర్మాతలుగా వ్యవహరించే ఈ చిత్ర షూటింగ్ జూన్ 10న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను డెహ్రాడూన్‌లో షూట్ చేయనున్నారు. ఎక్కువ భాగాన్ని అమెరికాలోనే చిత్రీకరించనున్నారు.

Related Posts