హైదరాబాద్
సీఎం చంద్రబాబు నివాసానికి జనతా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని పూర్తవడంతో ఏపీ రిజిస్ట్రేషన్ క్యాబ్ డ్రైవర్లకి హైదరాబాద్లో ఇబ్బందులు వస్తున్నాయని వారు అన్నారు. తెలంగాణలో టాక్స్లు పీచేస్తున్న వాహనాలని తిరగనివ్వని పరిస్థితి సమస్యలని పరిష్కరించాలంటూ, సీఎం చంద్రబాబుకి వినతిపత్రం కలిసి ఇవ్వడానికి వచ్చారు. తెలంగాణ లోకల్ డ్రైవర్స్ మరియు తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా మమ్మలని ఇబ్బంది పెడుతున్నారు అంటూ తెలియజేశారు. ఆంధ్ర టాక్సీ కార్లను సీజ్ చేసి భారీ మొత్తంలో జరీమానా విధించి, మిగత టాక్సీ డ్రైవర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. తెలంగాణా రవానా శాఖా అధికారులని సంప్రదించగా వారు కూడా మాకు ఎటువంటి సహాయం చేయటం లేదని అన్నారు..