హైదరాబాద్
శామీర్ పేట్ పరిధిలో పోతాయిపల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సురభి భీమ్ రావ్ ను టార్గెట్ గా చేసుకుని అయన వద్ద పెద్ద మొత్తం లో నదగు వున్నట్లు గుర్తించి, దోపిడీ కి పకడ్బందీ గా ప్లాన్ వేసారు. అందుకు ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని, టార్గెట్ వాసాలపై రెక్కీ నిర్వహించి దోపిడీ చేద్దామని పూర్తి సన్నాహాల్లో ఉన్న దశలో సీపీ సైబరాబాద్ నేతృత్వం లోని ఎస్వోటీ, శామీర్ పేట పోలీసు లు దోపిడీ ముఠాను పట్టుకున్నారు. నలుగురు పోలీసులు అదుపులో వున్నారు. చింతల రామ్ రెడ్డి (సూర్య నగర్ కాలనీ ఓల్డ్ ఆల్వాల్), సలీం (నర్సపూర్, మంచిర్యాల, అదిలాబాద్), భూమయ్య (నర్సాపూర్ విలేజ్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్, సిద్దిపేట్), శ్రీనివాస్ (మచ్చన్నపేట్ జనగాం జిల్లా) పోలీసు గుర్తించారు.. మరో 10 మంది పరారీలో ఉన్నట్టు సమాచారం