జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రవణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా డా. బోగ శ్రావణి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రదారి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారని శ్రావణి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ నుండి తప్పుకోవడానికి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడని ఫోన్ ట్యాపింగ్ లొ ప్రధాన పాత్ర ఎమ్మెల్యే సంజయ్ దేనని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసు లో సంజయ్ ని విచారించాలని, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ కి అప్పగించాలని ఆమె డిమాండ్ చేసారు.