YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష

పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష

హైదరాబాద్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గోన్నారు. జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన ప్రాధాన్యత అంశాలైనా ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, పర్యాటకాభివృద్ధి, మహిళా సంఘాల అభివృద్ధి తో పాటు ఇతర ప్రాధాన్యత అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు.
ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు యేన్నం శ్రీనివాసరెడ్డి , మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , వాకిటి శ్రీహరి, మెఘు రెడ్డి, చిట్టెం పర్ణిక రెడ్డి, అనిరుద్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి , డాక్టర్ వంశీకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Related Posts