హైదరాబాద్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గోన్నారు. జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన ప్రాధాన్యత అంశాలైనా ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, పర్యాటకాభివృద్ధి, మహిళా సంఘాల అభివృద్ధి తో పాటు ఇతర ప్రాధాన్యత అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు.
ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు యేన్నం శ్రీనివాసరెడ్డి , మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , వాకిటి శ్రీహరి, మెఘు రెడ్డి, చిట్టెం పర్ణిక రెడ్డి, అనిరుద్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి , డాక్టర్ వంశీకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.