YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రివర్గంనుంచి అఖిలప్రియను తొలగించాలి

మంత్రివర్గంనుంచి అఖిలప్రియను తొలగించాలి
రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు పేరుతో ప్రభుత్వ నిధులను వృధా చేస్తున్నారు. దిగజారుడు పదజాలం తో  ప్రధానిని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. మంత్రి అఖిల ప్రియ మాటలు సిగ్గు చేటు. ప్రధానే మహిళలపై అత్యాచారాలకు ప్రత్సహిస్తున్నారంటూ మాట్లాడారు. ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించాలి .  మమత బెనర్జీ కూడా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు . ప్రభత్వ ఉద్యోగుల్లో నిస్పృహలో ఉన్నారు . పోలీస్ లను కూడా వాడుకుంటున్నారు . వారంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని అయన హెచ్చరించారు. ఆంధ్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రోత్సహిస్తోంది . ల్యాండ్ బిల్ ను ఆమోదించారు. 2014 లో చంద్రబాబుకు మద్దతిచి బీజేపీ తప్పు చేసింది . 2019 లో తెలుగువారి  ఆత్మగౌరవం కోసం చంద్రబాబుకు వోట్ వెయ్యొద్దు. చంద్రబాబు ని ఆంధ్ర ముఖ్యమంత్రి చేయొద్దు. ప్రపంచ అధినేతగా పంపించాలి.  సూర్యునితో మాట్లాడే సత్తా ఈ చంద్రునికే ఉంది. చైల్డ్ ప్రోడిజి లోకేష్ బాబు ఉన్నాడని అయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దిగజారి మాట్లాడుతున్నారు . తీతువు పిట్టలా ఆయన మాట్లాడుతున్నారు.  వైసీపీ కూడా డ్రామాలు ఆడుతోంది. 5 ఏళ్ళ కోసం ఎమ్మెల్యేలు,  ఎంపీలను ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని గుర్తించాలి. ఆంధ్ర ప్రదేశగ్ కె అత్యధిక నిధులు వచ్చాయి. 85 శాతం హామీలను అమలు చేసాం . త్వరలోనే రైల్వే జోన్ , దుగరాజపట్నం పోర్ట్ సహా అన్ని హామీలను నెరవేరుస్తామని అయన అన్నారు.

Related Posts