YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాడయిన పన్నీరు, పాలు స్వాధీనం

పాడయిన పన్నీరు, పాలు స్వాధీనం

హైదరాబాద్
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా  ఇందిరా పార్క్ సమీపం గల  ఎమ్రాల్డ్ స్వీట్స్ లో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ తనిఖీలు జరిగాయి. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి.  కంపు కొడుతూ దుర్గంధ భరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీజ్ చేసారు.  స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ లో  ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. దాంతో  ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు.

Related Posts