YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఘనంగా అనంత్, రాధికల పెళ్లి..

ఘనంగా అనంత్, రాధికల పెళ్లి..

ముంబై, జూలై 12
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఇద్దరూ పెళ్ళితో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకలో పాల్గొనడం కోసం బాలీవుడ్-హాలీవుడ్ తారలు, ప్రపంచంలోని చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ముంబైకి చేరుకున్నారు. మరి అనంత్-రాధికలను ఆశీర్వదించనున్న అతిథి జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసా..!భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు.  కాగా బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ముంబై చేరుకున్నారు.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లికి అతిథి జాబితాలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఉన్నారు.

Related Posts