YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వచ్చే నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు

వచ్చే నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు

నర్సీపట్నం
ఆగష్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటిన్ పనులను అయన  పరిశీలించారు.  తరువాత నర్సీపట్నంలో నాలుగు రోజులు ముందుగానే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. తమ స్వంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్నా క్యాంటిన్ల ఉద్ధేశ్యం. గత ప్రభుత్వ హాయాంలో వీటన్నింటినీ మూసివేయడమే కాకుండా, కొన్ని చోట్ల ధ్వంసం చేశారు.  రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ స్వంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారు.  అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర్య దినోత్సవ రోజు నుంచి పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Related Posts