YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మైత్రి మూవీస్ ద్వారా వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ఆగస్టు 2న విడుదల

మైత్రి మూవీస్ ద్వారా వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ఆగస్టు 2న విడుదల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు వీక్షించి ఆగస్టు 2న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "మా విరాజి చిత్రానికి ఇటీవలే సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విక్షించి వారి బ్యానర్ ద్వారా మా విరాజి చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న  ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీస్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.
సినిమా పేరు: విరాజి
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు...

Related Posts