రంగారెడ్డి
రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్ర స్థాయికి దారి తీసింది. అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడం పై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదిక పైకి ఆహ్వానించవద్దని, అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ స్థానిక బీఆరెస్ నాయకులతో కలసి కార్యక్రమం వద్దనే బైటాయించారు. ఒకపక్క బీఆర్ఎస్ ఆందోళన లు కొనసాగిస్తుండగా... మరో పక్కా దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబందించిన చెక్కులను పంపిణి చేయడం జరిగింది. దేవాలయం ప్రాంగణం మొత్తం ఒక పార్టీ పై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటూ ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ను ఏర్పాటు చేయడం జరిగింది.