YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ పర్యటనలో అపశృతి

 పవన్ పర్యటనలో అపశృతి

విశాఖ జిల్లా పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పవన్ అభిమానులు విద్యుత్ఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర సాగుతోన్న విషయం తెలిసిందే. పోరాట యాత్రలో భాగంగా పవన్ బుధవారం పాయకరావుపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు 30 అడుగుల ఫ్లెక్సీ తయారుచేయించారు. ఈ ఫ్లెక్సీలను కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందారు. తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సూర్యామహల్ జంక్షన్ వద్ద ఓ భవంతి సమీపంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్‌నకు, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తమ అభిమాన నేతకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషాదం నెలకొంది. మరోవైపు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకు ఏజెన్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మంగళవారం పర్యటించారు. ఆయనకు స్థానికుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ ఊరికి వచ్చి కష్టసుఖాలు అడగలేదని, కానీ ఈ బాబు వచ్చి అడిగాడని జనాలు అంటున్నారు. ఆయన తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించిన పవన్, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ముఖ్యంగా గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వైద్యం అందక వారు పడుతున్న కష్టాలపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. 

Related Posts