హైదరాబాద్
గురువారం సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదిక ల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు జరుగుతాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులు హజరవుతారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు వుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.