ములుగు
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం లోని బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతుంది..బొగత జలపాతం వద్ద భారీగా వరద నీరు చేరడంతో పర్యాటకులు జలపాతాన్ని చూసి మంత్ర ముగ్దులవుతున్నారు. పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి జలపాతాల అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.జలపాతం వద్ద భారీగా వరద నీరు చేరడంతో పర్యాటకులు నీటి కొలనులో కి వెళ్ళే అవకాశం లేకపోవడం తో జలపాతం వద్దనే జలపాత అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.పాల నురుగు వలె జారిపోతున్న జలపాతాల్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని పర్యాటకులు అంటున్నారు.జలపాతం వద్ద వరద నీరు చేరడంతో అధికారులు పర్యాటకులను నీటి కొలనులోకి వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నారు.