YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెద్దిరెడ్డీ బుద్ది తెచ్చుకో..

పెద్దిరెడ్డీ బుద్ది తెచ్చుకో..

విజయవాడ
చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు. దమ్ముగా, ధైర్యం గా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసం పని చేసే మా నాయకుడికి భయం లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
దోచుకున్న మీకు భయం కాబట్టే... పారిపోతున్నారు. నిన్న మిమ్మలను అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్ల దాడి చేయించాడు. జగన్ కు, నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు. పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు. దొంగ చేతికి తాళ్లం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారు. పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా కూడేశాడు. అధికారం, ధన ప్రభావం తో విర్రవీగారు. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగ పడుతున్నారు. డబ్బు మదంతో అబ్బా కొడుకులు దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఓడించడానికి డబ్బులు వెదజల్లారు. అయినా ప్రజలు అబ్బా కొడుకుల కుట్రను తిప్పి కొట్టారు. నిన్న మిథున్ రెడ్టి చేసిన నిర్వాకం ప్రజలు చూశారు. మీ వైసిపి కార్యకర్తలే నీకు అండగా నిలవలేదు. అబ్బా కొడుకుల అవినీతి తో  ఆ పార్టీ వాళ్లే ఆశ్చర్యపోయారు. మీ నియోజకవర్గం లో ప్రజలే మిమ్మపను ఛీ కొడుతున్నారు. వెయ్యి తరాలు తిన్నా... తరగని సంపద పెద్దిరెడ్డి దోచుకున్నారు. నిన్న పుంగనూరు ప్రజలు మిథున్ రెడ్డి ని ఛీ కొట్టారు. మైనింగ్ గనుల ప్రజలు కు అప్పగించండని అన్నారు.
చంద్రబాబు దాడి చేయించారని  చెప్పడం సిగ్గు చేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా. మా నాయకుడు సంయమనంతో ఉండాలని చెప్పారు  కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే భయ పడుతున్నారు. ఆ బుక్ లోపేర్లు ప్రకటిస్తే ..ఇక మీ పరిస్థితి ఏమిటి. ఇప్పుడు అయినా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకో. కొడాలి నాని ఒక వెధవ... వాడు లాక్కున్న ధియేటర్ అసలు యజమానులకు అప్పగించారని అన్నారు.

Related Posts