YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రినుంచి బాలుడు కిడ్నాప్

ప్రభుత్వ ఆసుపత్రినుంచి బాలుడు కిడ్నాప్

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.  మాక్లూర్ మండలం మానిక్ భండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆస్పత్రిలోని కారిడార్లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించక పోయేసరికి ఆందోళనకు గురై ఆస్పత్రి అంతా వెతికాడు. ఎక్కడా కనిపించక పోవడంతో తన కొడుకు కిడ్నాప్కు గురైనట్లు గ్రహించి ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఒకటో టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఆస్పత్రిలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీసుకెళ్ళారనే విషయాన్ని తెలుసుకోడానికి ఆస్పతి పరిసరాల్లో, బస్టాండు, నగరంలోని ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Related Posts