ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం లోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చుతుంది.బొగత జలపాతం వద్ద భారీగా వరద నీరు చేరడంతో పర్యాటకులు జలపాతాన్ని చూసి మంత్ర ముగ్దు లవుతున్నారు.పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి జలపాతాల అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతం వద్ద భారీగా వరద నీరు చేరడంతో పర్యాటకులు నీటి కొలనులో కి వెళ్ళే అవకాశం లేకపోవడం తో జలపాతం వద్దనే జలపాత అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పాల నురుగు వలె జారిపోతున్న జలపాతాల్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని పర్యాటకులు అంటున్నారు. జలపాతం వద్ద వరద నీరు చేరడంతో అధికారులు పర్యాటకులను నీటి కొలనులోకి వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నారు. వర్షంలో సైతం పర్యాటకులు జలపాతానికి భారీగా వస్తున్నారు. పర్యాటకులను జలపాతం లోకి వెళ్లకుండా అటవీశాఖ అధికారులకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దట్టమైన అటవీప్రాంతం నుండి కొండ కోణాల నడుమ జాలువారుతున్న జలపాతాన్ని చూసి పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.