YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

*మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లు
*దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లు
*అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
*యథాతథంగా క్యాపిటల్ ఎక్స్ పెండీచర్
*తగ్గిన క్యాన్స‌ర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్లు, బంగారం, వెండి ధరలు
*ప్లాస్టిక్ ఐట‌మ్‌లు, ప‌వీసీ ఫ్లెక్స్ బ్యాన‌ర్లు, సోలార్ గ్లాస్‌, టిన్డ్ కాప‌ర్ ధరలు పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి   సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. తొమ్మిది సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన – నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన – ఆవిష్కరణలు, తయారీ – సేవలు, తర్వాతతరం సంస్కరణలు.. ఈ తొమ్మిది సూత్రాల ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్‌ రూపొందించినట్లు తన ప్రసంగంలో విత్త మంత్రి ప్రకటించారు.ఇక ఈ బడ్జెట్‌ మొత్తంలో వివిధ రంగాలన్నింటికి కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అదేవిధంగా నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్లుకుని బడ్జెట్ ను రూపొందించిందని అన్నారు.  ఈ తాత్కాలిక బడ్జెట్ లో ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం(క్యాపిటల్ ఎక్స్ పెండీచర్)ను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా రూ. 11.11 లక్షల కోట్లుగా ఉంచింది. ఐదేళ్లలో 20 లక్షల యువతకు కేంద్రం నైపుణ్య పథకాలు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వనుందన్నారు. టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్ ఫిప్ అవకాశాలు కల్పించేనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్న్ షిప్ భత్యంగా నెలకు రూ.5000, వన్ టైమ్ అసిస్టెన్స్ కింద రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కంపెనీలు ఇంటర్న్ షిప్ వ్యయంలో 12 శాతం భరించాల్సి ఉంటుంది.బీహార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. బీహార్ లో విమానాశ్రయాలు, మెడికల్ కాలేజ్ లు, క్రీడల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి పరుస్తామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15000 కోట్లను కేటాయించారు.బ‌డ్జెట్ ప్ర‌భావం వ‌ల్ల ధ‌ర‌లు త‌గ్గిన వాటిల్లో మూడు ర‌కాల క్యాన్స‌ర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్లు, దిగుమతి చేసిన బంగారం, దిగుమతి చేసిన వెండి ఉన్నాయి. లెద‌ర్ గూడ్స్ , సీఫుడ్‌, ఎక్స్ రే ట్యూబ్‌లు, రొయ్య‌లు, ఫిష్ ఫీడ్‌, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్‌-ప్యాన‌ళ్ల త‌యారీకి అవ‌స‌ర‌మైన వ‌స్తువులు, 25 ర‌కాల క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌, బ్రూడ్‌స్టాక్‌, పాలీచేటి వార్మ్స్‌, ష్రింప్‌, ఫిష్ ఫీడ్‌, మిథైలిన్ డైఫినైల్ డిస్సోసియ‌నేట్‌(ఎండీఐ) ఉన్నాయి. ఇక ధ‌ర‌లు పెరిగిన వ‌స్తువుల్లో ప్లాస్టిక్ ఐట‌మ్‌లు, ప‌వీసీ ఫ్లెక్స్ బ్యాన‌ర్లు, సోలార్ గ్లాస్‌, టిన్డ్ కాప‌ర్ ఇంట‌ర్‌క‌నెక్ట్‌, అమ్మోనియం నైట్రేట్ ఉన్నాయి.మొబైల్ ఫోన్లపై, యాక్ససెరీలపై, ఛార్జెస్ పై 15 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఉన్నత విద్య, దేశీయ సంస్థలకు రూ. 10 లక్ష ల కోట్లు కేటాయించారు. ఇకపోతే స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) లోటు 4.9 శాతం ఉండగలదన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం ఆర్థిక లోటుకే చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సమగ్ర సమీక్షను కూడా ప్రకటించారు. ఇది సంక్షిప్తంగా, సులభంగా చదవడానికి , వ్యాజ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. “ఆరు నెలల్లో పూర్తవుతుంది”  అని కూడా ఆమె అన్నారు

Related Posts