కాచిగూడ
ఫోక్సో కేసులో నిందితుడుగా ఉన్న ఓ డ్రైవర్ కు 20 ఏళ్ల కఠినకారాగార శిక్ష పడింది. హైదరాబాద్ కాచిగూడ రత్న నగర్ లో నివాసం ఉంటున్న మల్పారాజుల ప్రవీణ్ (28) వృత్తి రీత్యా డ్రైవర్. 2017 లో ప్రవీణ్ కుమార్ ఓ మైనర్ బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు కాచిగూడ పోలీసులు ప్రవీణ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ అనంతరం ఈ కేసు తీర్పు వెలుబడింది. నాంపల్లి హకా భవన్ లోనో ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జ్ పి పుష లత , నిందితుడి ప్రవీణ్ కు ఈ శిక్ష విధించారు. శిక్ష తో పాటు 5000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు. నిందితుడి ప్రవీణ్ ను జైలు కు తరలించినట్లు కాచిగూడ సిఐ చంద్రకుమార్ తెలిపారు