YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త డ్రామాలాడుతున్న జగన్

కొత్త డ్రామాలాడుతున్న జగన్

విజయవాడ
వన్ టౌన్ లో కాళీకాదేవి, చంద్రబాబు ఫ్లెక్స్ లతో టీడీపీ నేత  బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు జరిగింది.  బుద్దా అప్పారావు నిలయం నుంచి దుర్గగుడి వరకు వెంకన్న పాదయాత్ర జరిగింది. టోల్ గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు  జరిపారు.
బుద్దా వెంకన్న మాట్లాడుతూ జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. అ అబద్దం, ఆ అవినితి... అంటే జగన్ కు బాగా ఇష్టం. ఇప్పుడు అబద్దాలు తో డిల్లీలో మాయ ధర్నా చేస్తున్నాడు. పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడు.చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ నాలుగు వేలు చేశారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడు. 2004, 2009 లో జగబ్ ఎన్నికల అఫిడవిట్   ను పరిశీలీంచాలి. 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చింది. 42 వేలకొట్లు ఈడి  అప్పట్లో   జప్తు చేసింది. ఈ ఐదేళ్లల్లో మద్యం, మైనింగ్, ఇసుక  మాఫీయా లతో కోట్లు దోచాడని ఆరో్పించారు.
గత అవినీతి పై జగన్ జైలుకు వెళ్లాడు. ఈఐదేళ్లల్లో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలి. ఆ దుర్గమ్మ వద్దకయ ఊరేగింపుగా వచ్చి ఆ తల్లిని కోరాం. జగన్ అవినీతి, అక్రమాల పై విచారణ చేసి చర్యలు తీసుకునెలా చూడాలని వేడుకున్నాం. చంద్రబాబు వచ్చాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారు. జగన్ పాలనలొ ప్రజలు భయంతో బతికారు. మొన్న రషీద్ హత్య కూడా ఇద్దరు వైసిపి కార్యకర్త ల మధ్య గొడవ. రాజకీయ హత్య గా జగన్  ప్రచారం చేస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి హడావుడి  చేసినా నీ మోసాలను ఎవరూ నమ్మరు. చంద్రబాబు రాష్ట్రం లోప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మా వారిని కూడా  లా అండ్ ఆర్డర్ కు విఘాతం  కల్గించ వద్దని చెప్పిన నాయకుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి. జగన్ అవినీతి పై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐ కి ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే విచారణ చేసి జగన్ పై చర్యలు తీసుకోవాని అన్నారు.

Related Posts