హైదరాబాద్ జూలై 25
ఆరు గ్యారెంటీల హామీ పత్రం బడ్జెట్ అని, ఆర్భాటాపు అంకెలు కాకుండా వాస్తవపు లెక్కల బడ్జెట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2024-25కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఇది ఆరు గ్యారెంటీల బడ్జెట్ అని స్పష్టం చేశారు.తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపిందించిన భట్టి విక్రమార్క, ఆయన బృందానికి అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.