టైర్ల కంపెనీ గోడ కూలి 47 గొర్రెలు మృతి చెందిన ఘటనలో ఆ గొర్రెల యజమాని గొల్ల చంద్రయ్యను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జరిగిన దుర్ఘటనలో గొల్ల చంద్రయ్యకు చెందిన 47 గొర్రెలు మృతి చెందాయి. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ఘటనా స్థలానికి వెళ్ళారు. మృతి చెందిన గొర్రెలను చూశారు. చంద్రయ్యను పరామర్శించారు. జరిగిన నష్టం విలువను తెలుసుకున్నారు. చంద్రయ్యను ఓదార్చారు. చంద్రయ్యకు ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.