YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్‌

బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్‌
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.99కే నూతనంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే రూ.199, రూ.299,రూ.399లకు కూడా మరో మూడు నూతన ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. రూ99 ప్లాన్‌లో కస్టమర్లకు 45  జీబీ డేటా లభిస్తుంది. దీన్ని రోజుకు గరిష్టంగా 1.5 జీబీ వరకు వాడుకోవచ్చు. అలాగే రూ.199 ప్లాన్‌లో150 జీబీ డేటా వస్తుంది. ఇందులో రోజుకు 5 జీబీ డేటాను వాడుకోవచ్చు. రూ.299లో 300 జీబీ వస్తుండగా దీన్ని రోజుకు 10 జీబీ వరకు వాడుకునేందుకు వీలు కల్పించారు. ఇక చివరిగా రూ.399 ప్లాన్‌కు 600 జీబీ డేటా లభిస్తుంది. దీన్ని రోజుకు 20 జీబీ వరకు వాడుకోవచ్చు. ఇవన్నీ నెలవారీ ప్లాన్లు కాగా వీటన్నింటిలోనూ కస్టమర్లకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 20 ఎంబీపీఎస్ వరకు లభిస్తుంది. జియో త్వరలో ఫైబర్ టు ది హోమ్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టనుందని తెలుస్తున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. అయితే ఈ ప్లాన్లు కేవ‌లం నూత‌నంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకునే వారికే వ‌ర్తిస్తాయి. ఇప్ప‌టికే ఉన్న వినియోగ‌దారులకు ఈ ప్లాన్లు వ‌ర్తించ‌వు.

Related Posts