YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా సిద్దిపేట లో ర్యాలీ

కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా సిద్దిపేట లో  ర్యాలీ

సిద్దిపేట
కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా సిద్దిపేట లో నిర్వహించిన   ర్యాలీలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివాస్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో కలిసి సిద్దిపేట పట్టణం బిజెఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి  ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. మరియు జూలై 26 1999 భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై వీరోచితంగా పోరాడి  విజయం సాధించిన దానిని గుర్తుగా ఈ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పి కొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఎంతోమంది సైనికులు వీరమరణం పొందారు. భారత్ సైనికులు విజయం సాధించారు.  అందువల్ల ప్రతి ఏటా జూలై 26న వారిని స్మరించుకోవడం కోసం కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, మరియు పోలీస్ సిబ్బంది ప్రవేట్ స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts