YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్ క్లారిటీ

తల్లికి వందనంపై.. మంత్రి లోకేష్  క్లారిటీ

అమరావతి
ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామ ని మంత్రి లోకేష్ అన్నారు.. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Related Posts