పార్టీ, కులం, వర్గ పరంగా ప్రజల్ని వేరు చేసి కక్షసాధింపులకు చేస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో అన్ని వర్గాలకు మేలు చేసి ఎంతో అభివృద్ధి చేస్తే ఇప్పటి ప్రభుత్వం ప్రజలను దోచుకుతింటోందని ధ్వజమెత్తారు. నియోజవర్గాలలలో జరగని అభివృద్ధి వైఎస్ హయాంలో అయిదేళ్లలో చేసి చూపించానర్ననారు.. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొలదీ సమయం పడుతుండటంతో వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్రను కొనసాగించారు.వైఎస్ జగన్ను అక్కడి ఆటో కార్మికులు కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. దీంతో ఆటో కార్మికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీ పట్ల ఆటోకార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడే ఓ చిన్నారికి వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు