రంగారెడ్డి
భార్యపై అనుమానంతో హత్య చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతి 17 ఏళ్ళ క్రితం భర్త రాజు, కుటుంబ సభ్యుల తో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాజు హత్య చేసి అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇన్స్పెక్టర్ నాగరాజు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మృతుగాని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.