హైదరాబాద్
తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు.
స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోదముద్ర పడిన కొద్దిసేపటికే భూమిపూజ నిర్వహించారు. నెట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ వర్సిటీ తోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.