శ్రీశైలం
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 31 లక్షల 70 వేల 665 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 127 గ్రాముల బంగారం అలానే వెండి 4 కేజీల 400 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 489 యుఎస్ఏ డాలర్లు,108 ఖత్తార్ రియాల్,1 మలేషియా రింగిట్స్,2 సింగపూర్ డాలర్లు, సౌదీ అరేబియా రియాల్స్ 15, థాయిలాండ్ బాట్స్ 90, యూరోలు 5, ఇంగ్లాండ్ పౌండ్స్ 20 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు...