యాదాద్రి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణి వద్ద భక్తుల కోసం స్నాన సంకల్పాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని కూడా ఆరోజే ప్రారంభించ నుండగా.. దానికి సంబంధించిన పనులను ఆలయ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.....