YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..!

ఏపీ లో మరో కీలకం పధకం రద్దు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ, వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్‌ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్‌ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.

Related Posts