హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి సందర్బంగా మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ లో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమస్పూర్థి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. గల్లీ నుండి డిల్లీ దాకా తీసుకెళ్ళడంల, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవసరాన్ని వినిపించిన ఘనత జయశంకర్ సార్ కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడిన జయశంకర్ రాష్ట్ర ఏర్పాటు ను చూడకుండానే మరణించారని, చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డివిజన్ BRS పార్టీ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, రాజేందర్, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.