నిర్మల్
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో మహిళలకు ఫ్రీ బస్ టికెట్ తొలగించి ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు మండల ఆటో యూనియన్ మండల అధ్యక్షులు నగేష్, ఉపాధ్యక్షులు ఫసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ప్రభుత్వం కల్పించడంతో ఆటోలకు గిరాకీలు లేక ఆటో కార్మికుల కుటుంబాలు ఆర్తికి ఇబ్బందులతో తలడిల్లుతున్నాయన్నారు. వెంటనే ఫ్రీ బస్ టికెట్ తొలగించలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు పాల్గొన్నారు.