సిద్దిపేట
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ ఈరోజు చారిత్రాత్మకమైన దినం. శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహ ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమ స్పూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలి. అఖండ భారతదేశం ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.