రాజన్న సిరిసిల్ల
శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నాగదేవతకు పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి మహిళలు పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నాగుల పంచమి రోజున నాగమయ్యకు పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.