హర్ ఘర్ తిరంగా కాంపెయిన్ పురస్కరించుకొని ములుగు సబ్ డివిజన్ పరిధి లోని అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాను విక్రయించునున్నట్టు ములుగు పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ దయానంద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ జెండా కేవలం 25 రూ మాత్రమే అని ములుగు సబ్ డివిజన్ లోని ప్రతి పోస్టల్ కార్యాలయంలో జాతీయ జెండాలు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.ఆన్లైన్ లో కూడా మా సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. అందరూ సమీపంలోని పోస్టల్ కార్యాలయంలో జాతీయ జెండను తీసుకోవాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి దేశం పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకుందాం అన్నారు.