మేడ్చల్
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ గ్రామంలో దారుణ చోటు చేసుకుంది . ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో తండ్రి ఇద్దరు కుతురులను రైలు ఢీ కోట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతుడు మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ కి చెందిన కృష్ణ గౌడవెల్లి లో రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ చెకింగ్ గా పని చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం కావడం తో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పనికి వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా తన కూతురులు రైల్వే పట్టాల పై ఆడుకుంటున్న సమయంలో రైలు అటుగా రావాదని గమనించిన కృష్ణ ఇద్దరు కూతుర్లను కాపాడబోయి ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత ,వరిణిగా స్థానికులు చెప్తున్నారు.