విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాత్రి ఖమ్మం నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ఖమ్మం నగరం ప్రకారం నగరంలోని కాల్వవడ్డు హనుమాన్ గుడి సమీపంలో నివసించే దోనేపూడి మహేష్ బాబు (40) కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. తన పెంపుడు కుక్కకు స్నానం చేయించాలని నీటిని వేడిచేసేందుకు హీటర్ను పెట్టి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ హీటర్ను నీటిలో బదులు సంకలో పెట్టకున్నాడు. దీంతో తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అతను అక్కడే పడిపోయాడు. గమనించిన తన కుమార్తె కేకలు వేయటంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్విచాఫ్చేసి మహేష్ బాబును ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తీటౌన్ పోలీసులు తెలిపారు.