YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దూసుకెళ్తున్న హైడ్రా...

దూసుకెళ్తున్న హైడ్రా...

హైదరాబాద్, ఆగస్టు 12 
హైదరాబాద్‌ డిజాస్టర్ రెస్పాన్స్, అస్సెట్స్ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ.. సింపుల్‌గా హైడ్రా.. హైదరాబాద్‌ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ఏజెన్సీని.. ఇప్పుడీ హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లను పరుగులెత్తిస్తోంది. ఆక్రమణ అని కన్ఫామ్ అయితే చాలు.. సీన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆక్రమణలను మీరు కూలుస్తారా? మమ్మల్ని కూల్చమంటారా? అని వార్నింగ్ ఇస్తోంది.తెలంగాణ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా… దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. చెరువులు, కబ్జా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ఫుల్‌ స్పీడుమీదున్నారు.ఇక రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. మొత్తం 5 బిల్డింగులతో పాటు ఓ 25 కాంపౌండ్‌ వాల్స్‌ను జేసీబీ సాయంతో హైడ్రా కూల్చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపును ఎవరు అడ్డుకోకుండా పోలీసుల భారీగా బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి.అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులకు చెందినవైనా సరే… ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు హైడ్రా. బిల్డింగులను కూల్చివేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన బహదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్‌ ముబీన్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురుని అదుపులోకి తీసుకుని మరీ… కూల్చివేతలను కంటిన్యూ చేశారు అధికారులు.అంతకుముందు చందానగర్‌, కుత్బుల్లాపూర్‌లోని అక్రమ కట్టడాలను సైతం ఇలానే కూల్చేశారు. చెరువులు, కబ్జా భూములపై నిర్మాణాలు జరిపారన్న కంప్లైంట్‌ వస్తే చాలు… వెంటనే అక్కడ వాలిపోతున్నారు హైడ్రా అధికారులు. పెద్ద చిన్నా ఏం లేదు…అక్రమ నిర్మాణాలు చేస్తే అందరూ ఒకటేనన్న ప్రభుత్వ ఆదేశాలతో మాంచి దూకుడు మీదున్నారు.హైడ్రా డిపార్ట్‌మెంట్ మార్షల్స్.. DRF బృందాలు.. ఎక్స్‌కవేటర్లు.. పోలీసులు.. అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ నేరుగా అక్కడికి వెళుతున్నారు. ఫిర్యాదు రాగానే.. ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్స్ వద్ద ఉన్న మ్యాపులు, సాటిలైట్ పిక్స్‌తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అక్రమ కట్టడమని తేలిందా.. దాని పని ఖతం.. నిజానికి గతంలో నోటీసులతోనే వ్యవహారం నిలిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. గంటల్లోనే వ్యవహారం ముగిసిపోతుంది.ప్రభుత్వ విభాగాలన్ని ఏకతాటిపైకి రావడంతో.. అన్ని పనులు చకాచకా జరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతోంది. చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో,, ప్రభుత్వ స్థలాల్లో వేసిన లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమే అని చెప్పాలి.నిజానికి హైడ్రా అనే దానిని చాలా మంచి ఆశయంతో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఓ స్వతంత్ర వ్యవస్థ. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలన్ని దీని కిందకు వస్తాయి. ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత హైడ్రాకు ఉంటుంది. అది ఎలాంటి ప్రమాదమైనా కావొచ్చు. వాహన ప్రమాదాలను మొదలు పెడితే.. అగ్ని కావొచ్చు, వరదలు కావొచ్చు.. ఇలా ప్రమాదమేదైనా హైడ్రా రంగంలోకి దిగుతుంది. ఎట్ ది సేమ్ టైమ్.. అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హైడ్రాదే.. దీనికి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది హైడ్రాకు.. అందుకే అలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికే ఓ అల్టిమేటమ్ జారీ చేసింది. మీరు కట్టినవాటిని మీరే కూల్చేయండి. లేదంటే తాము వచ్చి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదంటుంది. నాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసు అని చెప్పి తప్పించుకునే చాన్స్‌ కూడా లేదు. తప్పు చేస్తే అనుభవించక తప్పదంటోంది. అయితే హైడ్రా మెయిన్‌ ఫోకస్ చెరువుల ఆక్రమణలపైనే ఉంది. భారీ వర్షాలు కురిసే టైమ్‌లో వర్షం కురిసే టైమ్‌లో నీరు చెరువులకే చేరుకోవాలి. కానీ ఈ చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్ని ముంపులో ఉండిపోతున్నాయి. అందుకే ముందు కబ్జా కోరల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

Related Posts