YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్

రాహుల్ గాంధీ  ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్

న్యూఢిల్లీఆగష్టు 12
హిమాచల్ ప్రదేశ్ లోని మండీకి చెందిన బిజెపి ఎంపీ కంగన రనౌత్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తూర్పారబట్టింది. సెబీ-హిండెన్ బర్గ్ వివాదంలో కడిగిపారేసింది. నిష్పక్ష విచారణను ఆమె డిమాండ్ చేశారు. ఆమె తన ‘ఎక్స్‘ పోస్ట్ లో రాహుల్ గాంధీని ‘ప్రమాదకర వ్యక్తి’ అని పేర్కొంది. ‘‘ రాహుల్ గాంధీ చాలా విషపూరిత, వినాశకర మనిషి. అతడి ఎజెండా ఏమిటంటే తాను ప్రధాని కాకపోతే, దేశాన్ని కూడా నాశనం చేయడానికి వెనుకాడడు’’ అంది. హిండెన్ బర్గ్ రిపోర్టును రాహుల్ గాంధీ ఆమోదిస్తున్నాడని పేర్కొంది.హిండెన్ బర్గ్ నివేదిక వెలువడ్డాక రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా మోడీ సర్కారును జవాబులడిగారు.

Related Posts