YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విదేశాలకు వందే భారత్....

విదేశాలకు వందే భారత్....

చెన్నై, ఆగస్టు 14,
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేలో భారీ మార్పులు సంభవించాయి. దాదాపు దేశంలోని ప్రధాన పట్టణాలకు మూడో లైన్ వేయడంతో పాటు గూడ్స్ అండ్ ప్యాసింజర్ లాంటి రైళ్లు ఎక్కడా ఆగకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో ప్రయాణికుల రవాణాతో పాటు వాణిజ్యం కూడా పెరుగుతోంది. రైల్వేలో ఇప్పటికే వందే భారత్ లాంటి అన్ని వసతులతో కూడిన రైళ్లు ప్రధాన పట్టణాలకు పరుగులు తీయడమే కాకుండా.. దగ్గరి, దగ్గరి ప్రాంతాలకు వందే భారత్ మెట్రో వస్తోంది. వీటిని విజయవంతం పరీక్షించిన అధికారులు ప్రధాన పట్టణాల్లో నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే వీటిని ఎగుమతి చేయాలని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్  నిర్ణయించింది. సమీప భవిష్యత్తులో తన ఆదాయానికి రక్షణ కల్పించుకోవడంతో పాటు రైలు, మెట్రో విభాగం అత్యంత ముఖ్యమైన సహకారాన్ని అందజేస్తుందని అంచనా వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో వందే భారత్, వందే భారత్ మెట్రో రైళ్ల ఎగుమతి ఆర్డర్‌లను పొందాలని కంపెనీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. బీఈఎంఎల్ ఛైర్మన్ శంతను రాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మొదట స్వదేశీ వందే భారత్ రైళ్లను ప్రారంభించడమే ప్రాధాన్యత. కానీ వచ్చే ఏడాది, మేము ఎగుమతి విషయంలో ఏదైనా ఆశించాలని అనుకుంటున్నాము. బీఈఎంఎల్ ప్రస్తుతం భారతీయ రైల్వేల కోసం వందే భారత్ స్లీపర్ రైలు సెట్ మొదటి నమూనాను తయారు చేస్తోంది. ఇది రాబోయే నెలల్లో విడుదల అవుతుందని బీఈఎంఎల్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా చొరవను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నం. ప్రస్తుతం మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికా, ఆసియా ప్రాంతంలో రైలు, మెట్రో ఎగుమతుల కోసం అవకాశాలను అన్వేషిస్తోంది’ అని రాయ్ చెప్పారు.వారి టాప్ లైన్‌లో దాదాపు 10% వరకు. వృద్ధిని క్రమబద్ధీకరించడానికి, బీఈఎంఎల్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించింది. మైనింగ్, నిర్మాణం, రక్షణ, రైల్వే, మెట్రో అనే మూడు కీలక విభాగాలపై దృష్టి సారించింది. కంపెనీ ఈ విభాగాల్లో 11 వ్యూహాత్మక వ్యాపార యూనిట్లను (SBU) ఏర్పాటు చేసింది, ప్రతి ఒక్కటి CEO నేతృత్వంలో ఎక్కువ నిర్ణయాధికారం, కార్యకలాపాలపై మెరుగైన నియంత్రణను కలిగి ఉంటుంది. జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో బీఈఎంఎల్ ఏకీకృత నికర నష్టం రూ. 70 కోట్లకు తగ్గింది, అయితే కంపెనీ టాప్‌లైన్‌లో 10 శాతం వృద్ధిని సాధించింది.లాభదాయకతకు సంబంధించి, గత సంవత్సరం పని తీరు గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉందని రాయ్ పేర్కొన్నారు. ‘ఈ సంవత్సరం, మేము ఎబిటెడ్ వృద్ధికి 13 శాతం వద్ద 100 బేసిస్ పాయింట్లు ఇచ్చాం. సమీప భవిష్యత్తులో 16 శాతం నుంచి 17 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆయన చెప్పారు. బీఈఎంఎల్ దాని భవిష్యత్తు అవకాశాల గురించి ఆశాజనకంగా ఉంది. రైలు, మెట్రో మరియు రక్షణ రంగాల్లో తన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తోంది.

Related Posts