ఖమ్మం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా వైరాకు రానున్నారు. హైదరాబాద్ నుండి నేరుగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. తరువాత మధ్యాహ్నం 3 గంటలకు వైరాలో జరిగే రైతు రుణమాఫీ సభకు హాజరవుతారు. వైరా సభలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి సందర్బంగా రైతులకు చెక్కులు అందిస్తారు. సభలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏఏ పనులు చేశారో వివరిస్తారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన నుండి 63 టిఏంసిల నీటిని వాడుకునేలా సిడబ్ల్యూసి అనుమతి తీసుకొచ్చిన విషయంపై సీతారామ ప్రాజెక్టు ఆవశ్యకతపై సీఎం,డిప్యుటీ సీఎం,ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మంత్రుల సుదీర్ఘ ఉపన్యాసం ఉండనుంది