రంగారెడ్డి
శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసారు. రాయదుర్గం సర్వేనెంబర్ 3,4,5లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆరోపించారు. ఆ నేపధ్యంలో భారీగా పోలీసుల మోహరించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు.