హైదరాబాద్
పాతబస్తీలో దేవత విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. సంతోష్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. సంతోష్ నగర్ రక్షపురంలోని భూలక్ష్మి దేవాలయ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దింతో హిందు భక్తులు భారీగా చేరుకొని ధర్నా చేపట్టారు.
స్పందించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.