YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ
ఢిల్లీ
లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న ఎమ్మెల్యసీ  కవితకు మంగళవారం బెయిల్ లభించింది. ఆమెకు సుప్రీం కోర్టు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. న్యాయవాది ముకుల్రోహత్గీ వాదనలు వినిపిస్తూ . కవితకు బెయిల్పొందే అర్హత ఉందని తెలిపారు. ఇప్పటికే కవిత బెయిల్పిటిషన్పై వాదనలు ముగిశాయని తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని కోర్టుకు విన్నిఇంచారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.
దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్గ్రూప్‌ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు

కవితకు బెయిల్ ఊహించిందే
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్   మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చింది. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూసారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపి కి బిఆర్ఎస్ దాసోహం అయ్యింది . హరిశ్, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి. బీజేపీ లో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుంది.  ఇంకా బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు.

హమ్మయ్యా.. కవితకు బెయిల్
వాడీవేడి వాదనలు..
హైదరాబాద్బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి, తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కవితకు ఎందుకివ్వరు.?
కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిలు ఇచ్చారని. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్భల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకూ వర్తిస్తాయని ముకుల్ రోహత్గీ తెలిపారు. కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరుఫు లాయర్ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. ఫోన్లలో మెసేజ్‌లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు అరేజ్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు.
 వాడీవేడి వాదనలు.!
సాక్ష్యులను బెదిరించారని చెబుతున్నారని. కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ తెలిపారు. కవిత నిరక్షరాస్యులు కాదు. ఏది మంచి, ఏది చెడు కాదో తెలియదా? అప్రూవర్ అరుణ్ పిళ్లై ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు? అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు? అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ , ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.

Related Posts