పెద్దపల్లి
హైదరాబాద్ డిజార్టర్ మేనేజ్మెంట్ కమిటీ మాదిరి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో అక్రమణకు గురి అవుతున్న చెరువులు, కుంటలను కాపాడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రావంటి టీంలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు కలిసి చెరువులు కుంటలను కబ్జా చేస్తున్నారని సురేష్ రెడ్డి ఆరోపించారు. చెరువులు, కుంటలు, ఫుల్ ట్యాంట్ లెవల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేస్తు అక్రమిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని చెరువులు, కుంటలు కబ్జా కాకుండ చూడాలని ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు చెరువులు కుంటలు అక్రమణకు గురికాకుండ చూడాలని సురేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.