శంషాబాద్
శంషాబాద్ లో దారుణం జరిగింది. సీతా గ్రాండ్ హోటల్ ( లాడ్జి) బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి హోటల్ యజమాని గణేష్ జంటలను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. విద్యుత్ బల్బుల మాటున సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న వైనం బయటపడింది. నిందితుడు గణేష్ ఒంగోలు వాసి గా గుర్తించారు. శంషాబాద్ వద్ద హోటల్ భవనాన్ని అద్దెకు తీసుకొని సీతా గ్రాండ్ పేరుతో లాడ్జి నడుపుతున్నాడు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు నిందితుడు గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.